హుకుంపేట,పెన్ పవర్,మార్చి 30:అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని హుకుంపేట మండలం రంగశిల గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న గిరిజన సంప్రదాయ పండగలో ప్రమాదం చోటుచేసుకుంది. పండగ సందర్భంగా గిరిజన స్త్రీలు రహదారిపై తాడు కట్టి, ఆ మార్గంలో వెళ్లే ప్రయాణికులను ఆపి బొట్టు పెట్టి దక్షిణగా నగదు స్వీకరించడం ఆనవాయితీ. సోమవారం ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో తాడు కట్టిన మహిళలు నీడలో విశ్రాంతి తీసుకుంటుండగా, అటుగా వేగంగా వెళ్తున్న ఓ బైక్దారుడు తాడును గమనించకుండా బలంగా ఢీకొన్నాడు. దీంతో వాహనం అదుపుతప్పి కిందపడిపోయాడు.పట్టాం పంచాయతీకి...