పోలవరం జిల్లాలో ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు
పెన్ పవర్ గంగవరం పోలవరం జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని ఏజెన్సీ డీఈవో వై మల్లేశ్వరరావు తెలిపారు. సోమవారం గంగవరం అడ్డతీగల లో గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికొన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదోతరగతి పరీక్ష కేంద్రాలను తనిఖీలు చేపట్టారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఆయన వెంట డిప్యూటీ తాసిల్దార్ జిలాని ,ఎంఈఓ రమేష్ తదితరులు ఉన్నారు.