కాజులూరు, పెన్ పవర్, మార్చి 31: కాజులూరు మండలం గొల్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. గొల్లపాలెం ఎస్సై ఎం. మోహన్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి ఈ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు.గొల్లపాలెం–కోటిపల్లి ప్రధాన రహదారి గుండా హైదరాబాద్కు వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆపి, వాటి రికార్డులను పోలీసులు సవివరంగా పరిశీలించారు. వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు తదితర అంశాలను తనిఖీ చేసి నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది పరిశీలించారు.ఈ సందర్భంగా...