మరిడమ్మ జాతరకు చురుగ్గా ఏర్పాట్లు -అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అయ్యన్న కుటుంబం -ఊరంతా విద్యుద్దీపాలంకణ -లక్షకు పైగా జనం జాతరలో పాల్గొంటారని అంచనా నర్సీపట్నం, పెన్ పవర్ (మార్చి 28) : నర్సీపట్నం ప్రజల ఆరాధ్య దైవం మరిడి మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. లక్షకు పైగా భక్తులు జాతరలో పాల్గొంటారనే అంచనాతో పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఊరంతా విద్యుద్దీపాలంకరణలు, పెద్దపెద్ద గేట్లు ఏర్పాటు చేస్తున్నారు. శనివారం...