మిగిలిన నష్టపరిహారం కోసం పోలవరం బాధితులు ఎదురుచూపులు బిజెపి నాయకుడు డివిఎస్ రమణారెడ్డి కలెక్టర్కు ఫిర్యాదు చింతూరు పెన్ పవర్ మార్చి 29 : పోలవరం ప్రాజెక్ట్ పరిధిలోని చింతూరు యూనిట్కు చెందిన బాధితులు మిగిలిన ఇళ్ల నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. సుమారు 120 కుటుంబాలకు ఇప్పటికీ నష్టపరిహారం చెల్లింపులో జాప్యం జరుగుతుండటంపై బాధితులకు న్యాయం జరగడం లేదని బిజెపి నాయకుడు డివిఎస్ రమణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం చింతూరుకు వచ్చిన పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ను కలిసిన రమణారెడ్డి,...