లబ్ధిదారులకు అండగా కూటమి ప్రభుత్వం కాజులూరు,ఏప్రిల్ 01 పెన్ పవర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కాజులూరు మండలంలోని గొల్లపాలెం గ్రామంలో పండుగ వాతావరణంలో జరిగింది.బుధవారం ఉదయం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చవ్వాకుల నారాయణమూర్తి (డాక్టర్ బాబు) సంయుక్త ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు.అలాగే పంచాయతీ కార్యదర్శి సీహెచ్ సూర్యప్రకాశ్, సచివాలయ సిబ్బంది సహకారంతో మండల మహిళా విభాగ అధ్యక్షురాలు...