ఓటర్ జాబితా ప్రదర్శనకు ఉంచిన అధికారులు
గూడెం కొత్తవీధి,పెన్ పవర్, ఏప్రిల్ 15: తహసిల్దార్ కార్యాలయంలో 16 గ్రామ పంచాయతీల ఓటర్ జాబితాను ఎంపీడీఓ రమణబాబు, తహసీల్దార్ అన్నజీరావు, ఉప మండల అభివృద్ధి అధికారి రత్నకుమార్ విడుదల చేశారు. ప్రజలు తమ పేర్లు జాబితాలో ఉన్నాయో లేదో చూసుకొని, తప్పులు ఉంటే వెంటనే తెలియజేయాలని సూచించారు. అన్ని పంచాయతీ కేంద్రాల్లో జాబితాలు ప్రదర్శించామని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.ఈవోపిఆర్డి కిట్లంగి బాలకృష్ణ, జీకే వీధి పంచాయతీ కార్యదర్శి పండ్రా పాల్ తదితరులు పాల్గొన్నారు.