కాకినాడ స్టాఫ్ రిపోర్టర్, పెన్ పవర్,ఏప్రిల్ 1: కాకినాడ జిల్లా నూతన కలెక్టర్గా ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టి సహకారంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఆయన స్పష్టం చేశారు.బుధవారం ఉదయం కలెక్టరేట్లోని తన ఛాంబరులో హరేంధిర ప్రసాద్ పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు విశాఖపట్నం నుండి అన్నవరం చేరుకుని శ్రీ రామ సత్యనారాయణ స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్కు చేరుకోగా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్,...