క్లాప్ మిత్రులకు వెంటనే జీతాలు చెల్లించాలి: అరికట్ట ఆంజనేయులు
గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 15: గ్రామాల పరిశుభ్రత కోసం పనిచేస్తున్న క్లాప్ మిత్రులకు పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలని వైసీపీ నాయకుడు అరికట్ట ఆంజనేయులు డిమాండ్ చేశారు. వేతనాలను నిలిపివేయడం వల్ల వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. క్లాప్ మిత్రులతో ఇతర పనులు చేయించడం సరైంది కాదని, పరిశుభ్రత పనులకే పరిమితం చేయాలని సూచించారు. ప్రభుత్వం తక్షణమే బకాయిలను విడుదల చేసి, సమయానికి జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.