జగ్గంపేటలో ఎమ్మెల్యే ప్రజాదర్బార్
జగ్గంపేట, పెన్ పవర్, ఏప్రిల్ 10: జగ్గంపేట రావులమ్మ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట ఎమ్మెల్యే శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పలు సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ప్రజల నుంచి అందిన ప్రతీ వినతి పరిష్కారం అయ్యేలా చూడాలని అధికారులకు ఆయన సూచించారు.