హుకుంపేట,పెన్ పవర్,ఏప్రిల్ 1: మండలంలోని హుకుంపేట పంచాయతీలో సర్పంచ్ సమిడ వెంకట పూర్ణిమ, కార్యదర్శి సత్యనారాయణ ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులకు బుధవారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ పూర్ణిమ మాట్లాడుతూ, ఏప్రిల్ 2తో సర్పంచ్ మరియు పాలకవర్గ సభ్యుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో గత ఐదు సంవత్సరాలుగా పంచాయతీ అభివృద్ధికి తనతో కలిసి కృషి చేసిన సభ్యులను సన్మానిస్తున్నట్లు తెలిపారు. ఈ కాలంలో తనకు సహకరించిన పంచాయతీ ప్రజలు, ప్రజాప్రతినిధులు, సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.పదవులతో సంబంధం లేకుండా భవిష్యత్తులో కూడా పంచాయతీ...