హెచ్‌ఎం రాజంనాయుడు హఠాన్మరణం

గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 29:జీకే  వీధి మండల గూడెంకాలనీ గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కిముడు రాజంనాయుడు అనారోగ్యంతో కన్నుమూశారు. సెలవుల సందర్భంగా పాడేరు మండలం గొండెలి గ్రామంలోని స్వగృహానికి వెళ్లిన ఆయన, మంగళవారం రాత్రి అకస్మాత్తుగా అస్వస్థతకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఆయన మృతి పట్ల విద్యాశాఖ అధికారులు, తోటి ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.