దక్షిణ కోస్తా రైల్వే జోన్లోకి కొత్తగా ఏడు రైల్వేస్టేషన్లు

విశాఖ కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ మరింత బలోపేతం అవుతోంది.ఇచ్ఛాపురం నుంచి పలాస వరకు ఉన్న 7 రైల్వే స్టేషన్లను కొత్తగా ఈ జోన్‌లోకి చేర్చారు.తూర్పు కోస్తా రైల్వే ఖుర్దా డివిజన్ నుంచి వీటిని విశాఖ డివిజన్‌కు బదిలీ చేస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.ఉత్తరాంధ్ర రైల్వే సేవలకు ఇది కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ఎన్నో ఏళ్ల డిమాండ్‌కు ఇప్పుడు పరిపాలనా రూపం దక్కిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు మరో బలం ఇచ్ఛాపురం–పలాస...