ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై జూన్ 2న అవగాహన సదస్సు

పాడేరు ఎమ్మెల్యే, జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై బూత్ స్థాయి ప్రతినిధులతో అవగాహన సదస్సు జూన్ 2న ఉదయం 10 గంటలకు పాడేరు “కాపీ హౌస్”లో నిర్వహించనున్నారు.పార్టీ ముఖ్య నాయకులు హాజరుకానున్న ఈ సమావేశానికి బీఎల్ఏలు, మండల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ వర్గాలు కోరాయి.