రాజమండ్రి: మే 16న కలెక్టరేట్లో జాబ్ మేళా
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజమండ్రి రూరల్ కలెక్టరేట్ ప్రాంగణంలో మే 16వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సి. హెచ్.శిరీష బుధవారం తెలిపారు. టెన్త్, ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్, ఏదైనా డిగ్రీ, ఎంబీబీఎస్, ఫార్మసీ, నర్సింగ్, ఎంబీఏ పూర్తి చేసి 19 - 32 సంవత్సరాల వయస్సు గల అభ్యర్థులు అర్హులన్నారు. ఎంపికైన వారికి తక్షణమే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.