జనాభా తగ్గుదలపై తహసీల్దార్ పరిశీలన

గూడెం కొత్తవీధి మండలంలోని ఎర్రవరం, సిరిబాల గ్రామాల్లో 2011 జనగణనతో పోలిస్తే జనాభా తగ్గుదలపై తహసీల్దార్ హెచ్.అన్నాజీ రావు పరిశీలన   నిర్వహించారు. గ్రామ పెద్దలతో మాట్లాడగా, కాఫీ బోర్డు మరియు ఎఫ్‌డీసీ క్వార్టర్స్‌లో నివసించిన తమిళనాడు కార్మిక కుటుంబాలు స్వగ్రామాలకు వెళ్లిపోవడంతో జనాభా తగ్గిందని తెలిపారు.గ్రామాల్లో ఎటువంటి కుటుంబం లేదా జనాభా మిగిలిపోలేదని అధికారులు స్పష్టం చేశారు.