మద్యం మత్తులో విధులకు హాజరైన ఉపాధ్యాయుడు సస్పెన్షన్

స్టాఫ్ రిపోర్టర్,పాడేరు/చింతపల్లి,జూలై 25:చింతపల్లి మండలం పినపాడు గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలో మెగా పీటీఎం కార్యక్రమానికి మద్యం మత్తులో హాజరైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడు కె.వి. రమణను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ టి. నిషాంతి తెలిపారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ పాటించని ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.