రోడ్డు భద్రత పట్ల అవగాహన కలిగి ఉండాలి
గార్ల, పెన్ పవర్, ఆగస్టు 12: విద్యార్థులు, యువత రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రాజకుమారి సూచించారు. గార్ల మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల లో బుధవారం ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించి, విద్యార్థులకు రోడ్డు భద్రతా నిబంధనలు, హెల్మెట్ ఆవశ్యకత, డ్రైవింగ్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రాజకుమారి మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన యువత మాత్రమే...