తరగతి గదుల్లో కృత్రిమ మేధస్సు.. కానీ బాలికలకు టాయిలెట్లేవీ?
‘వికసిత్ భారత్’ లక్ష్యాల మధ్య మౌలిక సదుపాయాలపై పెద్ద ప్రశ్న లక్షకు పైగా పాఠశాలల్లో బాలికలకు సరైన మరుగుదొడ్డి సౌకర్యం లేదు.. 32,965 స్కూళ్లలో అసలు టాయిలెట్లే లేవు UDISE+ గణాంకాల్లో వెలుగుచూసిన నిజాలు దేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు పరుగులు తీస్తోంది. తరగతి గదుల్లో ఏఐ, రోబోటిక్స్, డిజిటల్ లెర్నింగ్, స్మార్ట్ క్లాస్రూమ్ల గురించి చర్చిస్తున్నాం. ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని నిర్దేశించుకుంటున్నాం. ‘బేటీ బచావో.. బేటీ పఢావో’ అంటూ బాలికల విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతున్నాం. కానీ దేశంలోని లక్షకు పైగా పాఠశాలల్లో...