రామగోపాలపురం వద్ద టోల్‌గేట్ ప్రారంభం

చింతూరు, పెన్ పవర్, సెప్టెంబర్ 3: భద్రాచలం చింతూరు జాతీయ రహదారి ఎన్ హెచ్ 30పై రామగోపాలపురం గ్రామం సమీపంలో టోల్‌గేట్‌ను ప్రారంభించారు. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారుల నుంచి నిబంధనల ప్రకారం టోల్‌ రుసుము వసూలు చేయనున్నారు. టోల్‌గేట్ ప్రారంభంతో భద్రాచలం చింతూరు మధ్య రాకపోకలు సాగించే వాహనదారులపై టోల్‌ చార్జీల భారం పడనుంది. టోల్‌గేట్ వద్ద వాహనాల రాకపోకలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.