వైసీపీ హయాంలో గ్రామాలకు అభివృద్ధి శూన్యం:పెదవలస మాజీ సర్పంచ్ కృష్ణ వంశీ
గూడెంకొత్తవీధి,పెన్ పవర్,సెప్టెంబర్05:సంకడా పంచాయతీ ఉసిరిగూడెంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు జనసేన పార్టీలో చేరారు. రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మకత చైర్మన్ డాక్టర్ వంపూరు గంగులయ్య సమక్షంలో వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.ఈ సందర్భంగా పెదవలస మాజీ సర్పంచ్ కృష్ణ వంశీ మాట్లాడుతూ, తాను సర్పంచ్గా ఉన్నప్పటికీ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు.ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు.కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.