విమ్స్ లో స్వచ్ఛ్ ఆంధ్ర.. స్వచ్ఛ దివాస్

swachh-andhra-pure-divas-in-Vims

 పెన్ పవర్  విశాఖపట్నం,  ఫిబ్రవరి 15:
విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నందు శనివారం పరిసరాలను వైద్యులు, సిబ్బంది శుభ్రత చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన   స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ ను విమ్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కే రాంబాబు ప్రారంభించారు.. విమ్స్ పరిసర ప్రాంతాల్లో ఉన్న చెత్తను సిబ్బందితో కలిసి శుభ్రత చేశారు. అనంతరం విమ్స్ ప్రాంగణంలో మొక్కలను నాటారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల మూడవ శనివారం ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రం చేసుకోవాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు మేరకు ఆస్పత్రి మొత్తం పరిశుభ్రం చేయడం జరిగిందన్నారు.. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉండవచ్చు అన్నారు. ముఖ్యంగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చే వైద్యులకు ఆసుపత్రి పరిసరాలు ఆహ్లాదకరంగా.. పరిశుభ్రంగా ఉంటే రోగం వేగంగా తగ్గటానికి అవకాశం ఉంటుందన్నారు.. ఈ కార్యక్రమంలో విమ్స్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్,  వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు..

About The Author: Admin