సైలన్సర్స్ మ్రోగితే వాహనదారుడికి మోత మ్రోగుద్ది
నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలకు అమర్చిన 250 సైలన్సర్ను సీజ్
రోడ్డు రోలరుతో సైలన్సర్లను ధ్వంసం చేసిన ట్రాఫిక్ పోలీసులు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐ.పి.ఎస్.
వాహనాలకు సైలన్సర్స్ ను మార్పు చేయడం చట్టరీత్యా నేరమని, చట్టాన్ని ఉల్లంఘిస్తే వాహ నాలను సీజ్ చేయడంతో పాటు, వాహనాదారు లకు రూ.10 వేలు జరిమానా విధిస్తామ న్న జిల్లా ఎస్పీ విజయనగరం పట్టణంలో నిబంధనలకు విరు ద్ధంగా ద్విచక్ర వాహనాలను సైలన్సర్స్ ను అమర్చడం, కంపెనీ ఇచ్చిన సైలన్సర్స్ ను, తొల గించడం, మార్పు చేయడం చట్టరీ త్యా నేరమని, అటువంటి వాహనదారులపై చట్టరీత్యా కఠి న చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఫిబ్రవరి 20న హెచ్చరించారు. నిబంధనలకు వి రుద్ధంగా ద్విచక్ర వాహనాల కు అమర్చిన సైలన్స ర్స్ ను తొలగించి, వాటిని మళ్ళీ వాహన దారులు వినియోగించకుండా వాటిని రోడ్డు రోలర్ ధ్వంసం చేసే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.అనంతరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడు తూ - ద్విచక్ర వాహనాలను సంబంధిక వా హన తయారీ కంపెనీలు ప్రత్యేకంగా డిజైన్ చేసి, సైల న్సర్స్ ను అమరుస్తారని, వీటిని మార్పు చేయ డం చట్టరీత్యా నేరమన్నా రు. ఇటీవల కాలంలో యువత తమ ద్విచక్ర వాహనాలకు సైల న్సర్స్ మార్పులు చేస్తూ, పెద్ద శబ్ధాలతో ఇతర వాహన దారుల ను, ప్రజలు, పాదచారులను, పిల్లలు, హృద్రోగులను భయభ్రాం తులకు గురి చేస్తున్నా రన్నారు. వీటిని నియంత్రించుటలో భాగంగా గత ఆరు మాసాల్లో ట్రాఫిక్ పోలీసులు పట్టణం లో పలుమార్లు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి, నిబంధనల కు విరుద్ధంగా ఇండోర్, పంజాబ్, రాకెట్ పేర్లుతో అమర్చిన 250 సైలన్సర్స్ ను మెకానిక్ సహకా రంతో తొలగించామన్నారు. అంతేకాకుండా,ని బంధనలకు విరుద్ధంగా సైలన్సర్స్ ను అమర్చి నందుకుగాను ఒక్కొక్కరికి రూ.1000/- చొప్పు న రూ.2,50,000/- లను జరిమానా విధించామ న్నారు. తొలగించిన సైలన్సర్స్ ను మళ్ళీ వాహ నదారులు వినియోగించకుండా ఉండేందుకుగా ను వీటిని రహదారిపై వేసి, రోడ్డు రోలర్ తో ధ్వం సం చేసే కార్య క్రమాన్ని చేపట్టామన్నారు. భవి ష్యత్తులో ఇదే తరహా కార్యక్ర మాన్ని కొనసాగిస్తా మని, ప్రత్యేక డ్రైవ్లు చేపట్టి, నిబంధ నలకు విరు ద్ధంగా ద్విచక్ర వాహనాలకు ఉన్న సైలెన్సర్లను తొలగిస్తామ న్నారు. అంతేకాకుండా, కొత్త మోటా రు వాహన చట్టం ప్రకారం ఈ తరహా సైలన్సర్స్ ను అమర్చిన వాహనాలను సీజ్ చేయ డంతో పాటు, ఆయా వాహనదారులకు రూ.10వేలు జరిమాన విధిస్తామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు.ప్రతీ వాహన దారులు రహదారి భద్రత ను పాటించాలని, వాహనాలను అతివేగంగా నడవకూడదని, హెల్మెట్స్ ధరించాలని, ట్రిపుల్ రైడింగు చేయకూడదని, మన భద్రతతోపాటు ఇతరుల భద్రతకు కూడా జాగ్రత్తలు తీసుకోవాల ని ప్రజలకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ పిలుపుని చ్చారు.
ఈ కార్యక్రమంలో ఆయన విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివా సరావు, ట్రాన్స్పోర్టు కమీష నరు డి.మణికుమార్, ట్రాఫిక్ సిఐ సూరినాయు డు, ఎస్బీ సి.ఐలు ఎ.వి.లీలారావు, ఆర్.వి.ఆర్. కే. చౌదరి, 1వ పట్టణ సిఐ ఎస్.శ్రీనివాస్, 2వ పట్టణ సి.