మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, ఏప్రిల్ 3:
బాంబు బెదిరింపుల మెయిల్ మెస్సేజ్తో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో కలకలం రేపింది.. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు భయాందోళనతో ఒక్కసారిగా, వివిధ కార్యాలయాల నుండి బయటకు వచ్చారు.. వెంటనే అప్రమత్తమైన అధికారులు, ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రుకు తెలియజేశారు.. కలెక్టర్ వెంటనే డిసిపి కోటిరెడ్డికి సమాచారం అందించగా పోలీసులు, బాంబు, "డాగ్ స్క్వాడ్" బృందాలు రంగంలోకి దిగారు..
జిల్లా సమీకృత సముదాయంలో పోలీసులు తనిఖీలు నిర్వహించి, క్షుణ్ణంగా పరిశీలించారు.. బాంబు బెదిరింపులు తప్పుడు సమాచారంగా నిర్ధారించిన పోలీసులు, విషయాన్ని కలెక్టర్ గౌతమ్కు వివరించారు.. అయితే కలెక్టర్ గౌతమ్, తప్పుడు సమాచారం అయినప్పటికీ, బాంబు బెదిరింపుపై అశ్రద్ధ వహించకూడదని పోలీసులకు సూచించారు.. తదుపరి విచారణ కొనసాగించాలని డిసిపి కోటిరెడ్డిని కలెక్టర్ గౌతమ్ ఆదేశించారు..