అడ్డతీగల, పెన్ పవర్, మార్చ్31; మంగళవారం అడ్డతీగల ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్లు ధర్నా నిర్వహించారు. వారికి కనీస వేతనాలు 26 వేలు ఇవ్వాలని, అలాగే మే నెల అంతా వేసవి సెలవులు ప్రకటించాలని, డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అడ్డతీగల, వై .రామవరం సెక్టర్ లోని వర్కర్లంతా ఈ ధర్నాలో పాల్గొని నినాదాలు చేశారు. అనంతరంఐ.సి.డి.ఎస్ అనంతరంసూపర్వైజర్ అరుణలతకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అద్యక్ష రాలు జి. బేబీ రాణి కోశాధికారి, జి.పార్వతి ,సెక్టార్ లీడర్స్ బి. విజయ. కె.బుల్లమ్మ. వీరలక్ష్మి. అంగన్వాడీ వర్కర్లు.హెల్పర్స్ ఈ ధర్నాలో పాల్గొన్నారు.