చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 28:
చిలకలూరిపేట : పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల శనివారం పురపాలక సంఘం ప్రత్యేక అధికారిగా అదనపు బాధ్యతలను స్వీకరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో, ఆమె ఈ బాధ్యతలను చేపట్టనున్నారు. స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు ముగియడంతో, పరిపాలన సజావుగా సాగేలా ప్రభుత్వం కలెక్టర్లకు ఈ అదనపు బాధ్యతలను అప్పగించింది.