PEN POWER
Newspaper Banner
Date of Publish : 30 March 2026, 8:08 pm Posted By : SIVA KUMAR LANKA

నర్సీపట్నం మరిడమ్మ జాతరలో పిల్లల ఆనందం కోసం ఎగ్జిబిషన్ల ఏర్పాటు

నర్సీపట్నం మరిడమ్మ జాతరలో పిల్లల ఆనందం కోసం ఎగ్జిబిషన్ల ఏర్పాటు

-స్పీకర్ అయ్యన్నపాత్రుడు

నర్సీపట్నం, పెన్ పవర్ :

​నర్సీపట్నంలో శ్రీ మరిడి మహాలక్ష్మి అమ్మవారి జాతరను పురస్కరించుకుని ఈ ఏడాది పిల్లల కోసం ప్రత్యేకంగా ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేసినట్లు శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. పిల్లలు ఆనందించేలా టీటీడీ కళ్యాణ మండపం వద్ద, పెద్ద చెరువు శివాలయం పక్కన మరియు నర్సీపట్నం ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద మొత్తం మూడు ప్రాంతాల్లో ఈ ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేశామన్నారు. నర్సీపట్నం చరిత్రలో ఇలా ఎగ్జిబిషన్లు పెట్టడం ఇదే తొలిసారని ఆయన స్పష్టం చేశారు.