గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చి 28 :అల్లూరి సీతారామరాజు జిల్లా, గూడెం కొత్తవీధి మండలం పరిధిలోని పెదవలస గ్రామపంచాయతీకి చెందిన వారపు సంత ఆశీలు వసూలు హక్కుల కోసం ఈ నెల 31వ తేదీన బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు పంచాయితీ కార్యదర్శి కిట్లంగి బాలకృష్ణ తెలిపారు.2026–2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ వేలం కార్యక్రమం గ్రామ సర్పంచ్ పి. కృష్ణారావు ఆధ్వర్యంలో జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గల వ్యక్తులు అదే రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. తదుపరి మధ్యాహ్నం 3 గంటలకు అధికారికంగా వేలం పాట నిర్వహించబడుతుందని, పాల్గొనదలచిన వారు సమయానికి హాజరు కావాలని కోరారు.