మండువేసవిలోనూ అరగడ పల్లిలో హిమ సోయగాల
గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చి 25: అల్లూర జిల్లాలోని ప్రకృతి అందాలు మరోసారి ఆకట్టుకుంటున్నాయి.మండు వేసవిలోనూ ఇక్కడ మంచు మేఘాలు అలరిస్తుండటం విశేషం. జీకే వీధి మండలం వంచుల పంచాయతీ అరగడపల్లి గ్రామంలో బుధవారం ఉదయం సూర్యోదయం అయినా, 10 గంటల దాటినా మంచు తొలగకపోవడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. పచ్చని కొండల మధ్య శ్వేత వర్ణంలో మెరిసే మంచు మేఘాలు పాలకడలిని తలపిస్తున్నాయి. కాలాలతో సంబంధం లేకుండా ప్రకృతి సోయగాలు ఇక్కడ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.