తిరుమల శ్రీవారి ఆలయంలో ‘అష్టదళ పాదపద్మారాధన’ వేళల్లో మార్పు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉదయం 9 నుంచి 9.45 గంటల వరకు జరుగుతున్న ఈ సేవను, ఇకపై ఉదయం 6 నుంచి 6.45 గంటలకు నిర్వహించనున్నారు. టీటీడీ ఆగమ సలహా మండలి సూచనల మేరకు ఈ సమయాన్ని మార్చినట్లు అధికారులు వెల్లడించారు. భక్తులు ఈ మార్పును గమనించి సహకరించాలని టీటీడీ కోరింది.