సీతానగరం, పెన్ పవర్, మార్చి 28:
సీతానగరం నూతన ఎస్సై గా బి.వినయ్ ప్రతాప్ శనివారం భాద్యతలు చేపట్టారు. కాకినాడ సీసీఎస్ నుంచి బదీలీ పై వచ్చిన ఆయన గత ఎస్సై రామ్ కుమార్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణే తన ప్రధమ ప్రాధాన్యమని గతంలో జిల్లాలో పనిచేసిన అనుభవం మనకు తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ నేరాల నియంత్రణకు కృషి చేస్తానని వినయ్ ప్రతాప్ స్పష్టం చేశారు.