నర్సీపట్నం, పెన్ పవర్ :
బలిఘట్టం ఉత్తరవాహిని నదీ తీరంలో వేంచేసియున్న శ్రీశ్రీశ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి వారి వార్షిక కళ్యాణం ఈనెల 22న అనగా బుధవారం సాయంత్రం ఏడు గంటల నుండి అత్యంత వైభవంగా జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ శెట్టి మోహన్ తెలిపారు. వార్షిక ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా ఈ కళ్యాణం నిర్వహిస్తున్నామని, ఈ కళ్యాణంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు దంపతులు పాల్గొంటారని తెలిపారు. ప్రజలు యావన్మంది ఈ కళ్యాణంలో పాల్గొని, కనులారా తిలకించి, తీర్థప్రసాదములు స్వీకరించాలని కోరారు.