PEN POWER
Newspaper Banner
Date of Publish : 09 April 2026, 12:12 pm Posted By : D Ratnam

గంగవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏజెన్సీ డీఈవో తనిఖీ

 

గంగవరం, పెన్ పవర్:
గంగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఏజెన్సీ డీఈవో మల్లేశ్వరరావు గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహణలో ఉన్న రికార్డులను ఆయన సమగ్రంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు నమోదు, బోధన సంబంధిత రికార్డులు, పాఠ్య ప్రణాళికలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.అలాగే ప్రస్తుతం జరుగుతున్న సెకండరీ అసెస్‌మెంట్–2 (SA2) పరీక్షలను పరిశీలిస్తూ, పరీక్షల నిర్వహణలో పారదర్శకత, నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు ఉండాలని సూచించారు.పరీక్షల నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా పాఠశాల సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా కృషి చేయాలని ఆయన ఆదేశించారు.ఈకార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సత్యరావు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.