PEN POWER
Newspaper Banner
Date of Publish : 01 April 2026, 1:03 pm Posted By : M CHANTI BABU

దొడ్డి కొండ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ

గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 1:అల్లూరి జిల్లా జీకే వీధి మండలం దామనాపల్లి పంచాయతీ పరిధిలోని దొడ్డి కొండ గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కొర్ర సీతమ్మకు నూతన వితంతు పింఛన్ మంజూరు చేసి పంపిణీ చేశారు.ఈ పింఛన్‌ను తెలుగుదేశం పార్టీ పంచాయతీ కార్యదర్శి పనసల చిట్టిబాబు, పేసా మండల ప్రధాన కార్యదర్శి మాదిరి చంటిబాబు, జనసేన పార్టీ నాయకులు వసుపరి పొన్నాలు చేతుల మీదుగా గృహ నిర్మాణ శాఖ ఏఈ పసుపులేటి లక్ష్మీ విమల పంపిణీ చేశారు.అలాగే గ్రామ పెద్దలు గబులంగి అబ్బాయి దొర, మర్రి ఇమ్మానియేల్ (చిరంజీవి) తదితరులు హాజరయ్యారు.