PEN POWER
Newspaper Banner
Date of Publish : 01 April 2026, 12:46 pm Posted By : D Ratnam

పదో తరగతి పరీక్షా కేంద్రాల తనిఖీ

 

గంగవరం పెన్ పవర్ ఏప్రిల్ 1

గంగవరం, అడ్డతీగల ,రాజోవమ్మంగి మండల కేంద్రాల్లో జరుగుతున్న పదవ తరగతి పరీక్షా కేంద్రాలను బుధవారం ఏజెన్సీ డీఈవో వై మల్లేశ్వరరావు తనిఖీలు చేపట్టారు. ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. పోలవరం జిల్లా వ్యాప్తంగా 12 కేంద్రాల్లో ఒకేషనల్ కోర్సు కు సంబంధించి పరీక్ష నిర్వహించడం జరిగిందని ఈ పరీక్షకు1086 గాను నలుగురు విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు. పై మూడు కేంద్రాల్లో 175 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సిందిగా ఒకరు మాత్రమే గైర్హాజరు అయ్యారు .ఆయన వెంట కేంద్రం ప్రత్యేక అధికారి మండల వ్యవసాయ అధికారి కె విశ్వనాథ్, డిప్యూటీ తాసిల్దార్ జిలాని తదితరులు ఉన్నారు.