PEN POWER
Newspaper Banner
Date of Publish : 11 April 2026, 6:57 pm Posted By : M CHANTI BABU

మాజీ సర్పంచ్ దంపతులకు ఎంపీటీసీ సన్మానం

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 11: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం వంచుల పంచాయతీకి చెందిన తాజా మాజీ సర్పంచ్ వనపల కాసులమ్మ, వైఎస్సార్సీపీ వాణిజ్య విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు వనపల రాజేష్ దంపతులను వంచుల పంచాయతీ ఎంపీటీసీ జోరంగి సరస్వతి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా దుశాలువ కప్పి వారి సేవలను కొనియాడారు. పంచాయతీ అభివృద్ధికి సర్పంచ్, ఎంపీటీసీ సమన్వయంతో కృషి చేయడం వల్ల గ్రామానికి ప్రయోజనం చేకూరిందని సన్మానం అందుకోవడం ఆనందంగా ఉందని, పంచాయతీ అభివృద్ధికి అందరి సహకారంతో ముందుకు సాగినట్లు వనపల రాజేష్ పేర్కొన్నారు.