స్టాప్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్త వీధి,పెన్ పవర్,ఏప్రిల్ 16:చింతపల్లి శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవాల సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకు శాసన సభ్యులు, అల్లూరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు అమ్మవారిని దర్శించుకోనున్నారు.ఈ సందర్భంగా చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పార్టీ వర్గాలు కోరాయి. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.జాతర మహోత్సవాలు విజయవంతంగా జరగాలని నాయకులు ఆకాంక్షించారు.