PEN POWER
Newspaper Banner
Date of Publish : 05 May 2026, 3:29 pm Posted By : D Ratnam

మహిళా సంఘాల డిజిటలైజేషన్‌కు 476 వివోఏలకు 5జీ ఫోన్లు

 

రంపచోడవరం, పెన్ పవర్ మే 5:
పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ 476 మంది వివోఏలకు 5జీ సాంసంగ్ మొబైల్ ఫోన్లు పంపిణీ చేశారు. మహిళా సంఘాల రుణాలు, లావాదేవీల వివరాలను తక్షణం డిజిటల్‌గా నమోదు చేయడం లక్ష్యమని తెలిపారు.

ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి మాట్లాడుతూ ఈ చర్య మహిళల ఆర్థిక సాధికారతకు తోడ్పడుతుందని చెప్పారు. ఈ ఫోన్ల ద్వారా పనితీరు మెరుగుపడి, మహిళా సంఘాలపై సమర్థవంతమైన పర్యవేక్షణ సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు.