PEN POWER
Newspaper Banner
Date of Publish : 08 May 2026, 12:54 pm Posted By : M CHANTI BABU

రేపు భీమవరంలో ఎంపీటీసీ కొర్ర భీమారాజు అంత్యక్రియలు

పెన్ పవర్, మే 9: కొత్తవీధి మండలం దామనాపల్లి పంచాయతీ భీమవరం గ్రామానికి చెందిన స్థానిక ఎంపీటీసీ కొర్ర భీమరాజు గురువారం ఉదయం మృతి చెందారు.ఆయన మృతి వార్త తెలిసి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, గ్రామస్థులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవలందించడంలో భీమరాజు ముందుండేవారని గ్రామస్థులు గుర్తుచేసుకున్నారు.ఆయన అంత్యక్రియలు శుక్రవారం ఉదయం 10 గంటలకు స్వగ్రామమైన భీమవరంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తెలిపారు.