PEN POWER
Newspaper Banner
Date of Publish : 02 June 2026, 5:53 pm Posted By : M CHANTI BABU

క్షేత్రస్థాయిలో సెన్సస్ వివరాలు పరిశీలించిన అధికారులు

సెన్సస్–2026 కార్యక్రమంలో భాగంగా గూడెం కొత్తవీధి మండలం పెదవలస గ్రామంలో అసిస్టెంట్ ఛార్జ్ ఆఫీసర్, ఎంపీడీవో బిహెచ్‌వీ రమణబాబు క్షేత్రస్థాయిలో పరిశీలనలు నిర్వహించారు. గ్రామంలో జనాభా నమోదు, గృహ వివరాల సేకరణ తదితర అంశాలపై అధికారులతో సమీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా సిబ్బందికి అవసరమైన సూచనలు అందజేసి, సమాచార సేకరణను కచ్చితత్వంతో నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో జగదీష్, పెదవలస పంచాయతీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ కిట్లంగి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.