గూడెం కొత్తవీధి,పెన్ పవర్ ఏప్రిల్1:ప్రకృతి పరిరక్షణ కొరకు మొక్కలు నాటాలి, చెట్లను పెంచాలి అని ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తూ ఉంది. అలాగే గిరిజన ప్రాంతంలో రైతులు అధిక శాతం మంది ఉద్యానవన పంటలు, కాఫీ మిరియాల తోటల పెంపకానికై ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రభుత్వం కూడా అటువంటి రైతులను ప్రోత్సహిస్తుంది. కానీ ఎండాకాలం వచ్చిందంటే కాఫీ తోటలు, సిల్వర్ తోటలు ఉన్న రైతుల కంటిమీద కునుకు లేకుండా పోతుంది. కొన్నిసార్లు ఎంత జాగ్రత్తగా అగ్గిలైన్లు చేసుకున్న కొంతమంది అగంతకుల కారణంగా తోటలు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. మండలంలో వంచుల పంచాయితీ చామగడ్డ గ్రామానికి చెందిన యువరైతు చెదల శశికాంత్ ఆరు సంవత్సరాల క్రితం ఎంతో కష్టపడి మూడు ఎకరాల తన భూమిలో సిల్వర్ మరియు జాప్రా మొక్కలను నాటారు. చెట్లు ఎదగటంతో కాఫీ మొక్కలను నాటారు.