బిర్లా జంక్షన్ లో ట్రాఫిక్ జామ్...
విశాఖపట్నం ఇసుకతోట ట్రాఫిక్ సిగ్నల్ వద్ద గ్రూప్-2 శనివారం రాత్రి అభ్యర్థులు మెరుపు సమ్మెకు దిగారు. పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. సీ.ఎం, డిప్యూటీ సీ.ఎం, లోకేశ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో బిర్లా జంక్షన్ లో ట్రాఫిక్ జామ్ అయింది. పోలీ సులు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాగా.. కొద్దిసేపటి క్రిత మే పరీక్ష యథాతదంగా నిర్వహిస్తామని ఏ.పీ.పీ.ఎస్.సి ప్రకటించింది.