- ఎలక్ట్రిక్ వాహనాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- సబ్సిడీ పొడిగింపుతో EVలకు డిమాండ్ పెరుగుదల
- టూవీలర్ల కొనుగోలుదారులకు భారీ ఊరటనిచ్చిన నిర్ణయం
- ఇ-రిక్షా, కార్ట్స్ రంగానికి దీర్ఘకాల ప్రయోజనం
- తక్కువ ఖర్చుతో వాహనం కొనుగోలు చేసే అవకాశం
- పెట్రోల్, డీజిల్కు ప్రత్యామ్నాయం EVలు
- పర్యావరణ హిత విధానాలకు కేంద్రం ప్రాధాన్యం
- ఛార్జింగ్ ఖర్చులు తగ్గడంతో ప్రజల్లో ఆసక్తి
- 2026–2028 వరకు సబ్సిడీ కొనసాగింపు
- ఇప్పుడు EV కొనడానికి ఉత్తమ సమయం
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విజయవాడ, మార్చి 29:
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. PM E-Drive Scheme 2026 కింద అందిస్తున్న సబ్సిడీలను మరింత కాలం పాటు పొడిగిస్తూ వినియోగదారులకు భారీ ఊరటనిచ్చింది. ప్రభుత్వం ప్రకటించిన తాజా నిర్ణయం ప్రకారం, ఎలక్ట్రిక్ టూవీలర్లపై సబ్సిడీని 2026 జూలై 31 వరకు కొనసాగించనుంది. అలాగే, ఇ-రిక్షాలు మరియు ఎలక్ట్రిక్ కార్ట్స్పై సబ్సిడీని 2028 మార్చి 31 వరకు పొడిగించింది.
ఈ నిర్ణయం వల్ల తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే అవకాశం సాధారణ ప్రజలకు లభించనుంది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో ఈ వీ లపై ఆసక్తి పెరుగుతున్న తరుణంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారులకు మేలు చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వల్ల ఛార్జింగ్ ఖర్చులు తక్కువగా ఉండటంతో పాటు పర్యావరణ కాలుష్యం తగ్గించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయమని అధికారులు సూచిస్తున్నారు.

