ఆకుపచ్చ కాదు, ఎర్రని క్యాబేజీ: రైతులకు కొత్త మార్కెట్ అవకాశాలు
బ్రాసికా ఓలేరేసియా: ఎర్రని క్యాబేజీ మజిలీ ప్రారంభం
గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చి 30:సాధారణంగా ఆకుపచ్చగా ఉండే క్యాబేజీని ఎర్రగా పండించడం ఇప్పుడు జీకేవీధిలో ప్రారంభమైంది.బ్రాసికా ఓలేరేసియా శాస్త్రీయ నామం కలిగిన ఈ ఎర్రని క్యాబేజీ ఈశాన్య రాష్ట్రాల్లో పండుతుంది. జీకేవీధి మాలిగూడ గ్రామానికి చెందిన శంకర్, ఒరిస్సా నుంచి ప్రత్యేక విత్తనాలు తీసుకుని స్థానికంగా ఈ ఎర్రని క్యాబేజీ పండించారు. సోమవారం వీటిని విక్రయానికి తెచ్చారు.స్థానిక వ్యవసాయ వృత్తిపరులు మాట్లాడుతూ, ఈ ఎర్రని క్యాబేజీ ప్రత్యేకంగా సలాడ్ మరియు హోటల్ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కొన్ని స్టార్ హోటల్స్ ఇప్పటికే ఈ కొత్త పంటను సప్లై చేసుకోవడం ప్రారంభించాయి.ఈ పంటతో స్థానిక రైతులు కొత్త మార్కెట్ అవకాశాలను పొందగలరని ఆశిస్తున్నారు.

