సీతానగరం, పెన్ పవర్, మార్చి24:
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలని చిన కొండెపూడి సొసైటీ చైర్మన్ కాండ్రు శేఖర్ గ్రామం లో ఉన్న రైతులు కలిసి మండల తాసిల్దార్ కు మంగళవారంనాడు తాసిల్దార్ కార్యాలయంలో చినకోండేపూడి రైతులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ శేఖర్ మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన రైతుల ధాన్యాన్ని ఆఫ్లైన్లో ధాన్యం కొనుగోలు చేయాలని రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు త్వరిగతిన ప్రారంభించాలని అన్నారు. వాతావరణం మార్పుల నేపథ్యంలో రైతులు పండించిన వృధా అవ్వకుండా వ్యవసాయ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ స్పందించి రైతులను కాపాడాలని తెలిపారు.
రిపోర్టర్ వివరాలు
పేరు: DURGARAO Pహోదా: REPORTER
ప్రాంతం: SEETANAGARAM, EG DIST



