గంగవరం పెన్ పవర్ సెప్టెంబర్ 27
పోలవరం జిల్లా గంగవరం మండలంలోని సూరంపాలెం ప్రాజెక్టు లో బుధవారం సాయంత్రం యువకుడు నీట మునిగిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం నుంచి యువకుడి మృతదేహం కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. శుక్రవారం ఉదయం మృతదేహం లభ్యమైంది. మృతుడు నెల్లిపూడి గ్రామానికి చెందిన కొంజర్ల ఈశ్వర వర ప్రసాద్ (21) గా గుర్తించారు. మృతదేహం గాలింపు కోసం ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి.


