కాకినాడ, పెన్ పవర్, ఏప్రిల్ 1:
జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఎం.ఎన్. హరేందిర ద ప్రసాద్ ను ఆయన కార్యాలయం లో కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు రెడ్డిపల్లి రాజేష్, కార్యదర్శి డెంకాడ మోహన్, కోశాధికారి చైతన్యతో పాటు సభ్యులు చిష్టి, ఆకెళ్ళ శ్రీనివాస్, నందిని తదితరులు కలెక్టర్కు శాలువా కప్పి, మెమెంటో అందించి శుభాకాంక్షలు తెలిపారు.క్లబ్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల గురించి వివరించగా, కలెక్టర్ అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ తిమ్మప్ప, ఏపీఆర్వో రవి, బాబురావు, క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసిన సిటీ ప్రెస్ క్లబ్ కార్యవర్గం
RELATED ARTICLES

