రంపచోడవరం పెన్ పవర్
పోలవరం జిల్లాలో పులి అలజడితో ప్రజల భయాందోళనలకు గురవుతున్నారు. శుక్రవారం రాత్రి రంపచోడవరం మండలం బందపల్లి పంచాయతీ తాళ్లపాలెం లో ఒక దూడలపై పులి దాడి చేయడంతో దూడ మృత్యువాత పడింది దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు అటవీ శాఖ సిబ్బంది గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పిస్తున్నారు అయినప్పటికీ పులి హల్ చల్ తో జిల్లా ప్రజలు కంటిమీద కునుకు లేకుండా భయపడిపోతున్నారు



