గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మార్చి 25:
మండలంలోని జీకే వీధిలో శ్రీ రామ నవమి ఉత్సవాల సందడి ప్రారంభమైంది. ఈ నెల 27 న జరిగే వేడుకలకు ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. అదే రోజు సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.ఇందుకోసం బుధవారం ఉత్సవ పందిరి రాట కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. మహిళలు, గిరిజనులు పూజలు చేసి వేడుకలకు శ్రీకారం చుట్టారు. 27న ఉత్సవమూర్తుల ఊరేగింపు, కళ్యాణం వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గొర్లె వీర వెంకట్, బిజెపి నాయకులు రిమెల పాల్, ఎంపీటీసీ రాజేశ్వరి, పెద్దలు లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ వివరాలు
పేరు: M CHANTI BABUహోదా: STAFF REPORTER
ప్రాంతం: ALLURI DIST



