చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, మార్చి 24:
నాదెండ్ల : పోలీసు స్టేషన్ పరిధిలో ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఎనిమిదో తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలికను మాయ మాటలతో మోసం చేసి ఇబ్బందులకు గురి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.పోలీసుల వివరాల ప్రకారం, షేక్ షాహిద్ (17) అనే యువకుడు బాలికతో పరిచయం పెంచుకుని, చనువుగా ఉండి ఆమెను తప్పుదారి పట్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాలిక తల్లి మాధవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, నాదెండ్ల పోలీసులు షాహిద్పై పాక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.



